14-06-2025 11:57:17 PM
ఎల్బీనగర్: ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇంకా రాణించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) అన్నారు. నాగోల్ డివిజన్ పరిధిలోని పీఎన్ఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సఖీ బజార్ ఎగ్జిబిషన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. సఖీ బజార్ ఆర్గనైజర్ శ్రీగిరి తరుణి వెంకట్ మాధవరెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. మహిళలకు కావాల్సిన వాటిని ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఎగ్జిబిషన్ కి 3,000 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి, స్టేట్ సెక్రటరీ నల్లా ప్రశాంత్ రెడ్డి, శ్రీగిరి వెంకట మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.