15-06-2025 12:00:46 AM
హయత్ నగర్ కోర్టులో లోక్ అదాలత్..
ఎల్బీనగర్: హయత్ నగర్ కోర్ట్ సముదాయంలో 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో శనివారం లోక్ అదాలత్(Lok Adalat) నిర్వహించారు. లోక్ అదాలత్ లో కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారు. న్యాయమూర్తి సల్మా ఫాతిమా, 7వ మెట్రోపాలిటన్ ఇన్ చార్జి మేజిస్ట్రేట్ సీహెచ్ నర్మద ఆధ్వర్యంలో మొత్తం 6057 కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించారు.
కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ కాశి రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లావణ్య కుమార్, బెంచ్ మెంబర్లు సంతోష్ కుమార్ గౌడ్, సరిత, శివ కుమార్, జయసుధ దేవి, హయత్ నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోడెం ప్రభాకర్ గౌడ్, కార్యదర్శి బండి నరేశ్, ఉపాధ్యక్షుడు మేకల సతీశ్, కోశాధికారి ఈశ్వర్ గౌడ్, సీనియర్ న్యాయవాది రామ్ మోహన్, సభ్యులు గోపీ శంకర్, సూపరింటెండెంట్ దార రాములు, సీఐలు నాగరాజు గౌడ్, అశోక్ రెడ్డి, మహేష్ గౌడ్, కోర్ట్ కానిస్టేబుళ్లు, న్యాయ వాదులు మరియు కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.