calender_icon.png 3 June, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ముగుసిన నాయిని టి-10 క్రికెట్ టోర్నమెంట్

01-06-2025 10:43:56 PM

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): నాయిని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్(Naini Vishal Reddy Memorial Trust) ఆధ్వర్యంలో గడిచిన 14 రోజులుగా నిర్వహించిన నాయిని టి-10 లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Warangal West MLA Naini Rajender Reddy) పాల్గొన్నారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ క్రికెట్ పోటీలలో మొత్తంగా 176 టీమ్ లు పాల్గొన్నాయని గెలిచిన వారిని ఓడిన టీమ్ సభ్యులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లారని, రాజకీయాలకు అతీతంగా ఈ టోర్నమెంట్ రెండో సీజన్ ను విజయవంతంగా నిర్వహించామని, నేడు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా నాయిని విశాల్ రెడ్డి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు.

ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా టీమ్ నాయిని నిర్వాహక బృందాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని అభినందించారు. కాజీపేట సురేష్ టీమ్ ప్రథమ స్థానంలో నిలిచి కప్ తో పాటు రూ.100000/- ల బహుమానం, రెండో విజేతగా నిలిచిన అలంకార్ ఫిరోజ్ టీమ్ కప్, రూ.50000/-ల బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుమార్తె, అల్లుడు డా.శ్రీ గోదా విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.