01-06-2025 10:38:16 PM
ప్రధాన ఎన్నికల అధికారి దశరథ రావు..
హనుమకొండ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో హనుమకొండ హంటర్ రోడ్డులోని వెలమ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి దశరధరావు(Chief Electoral Officer Dasharath Rao) మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం సంఘం ఎన్నికలు నిర్వహించకుండానే ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకునే వారని కానీ, ఈసారి పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఎన్నికలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల అనంతరం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి పిన్నింటి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.