9 May, 2026 | 4:44 PM

నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..

09-05-2026 04:06 PM

ఆలేరు,(విజయక్రాంతి): నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వారి అవగాహన సదస్సు ఐపీసీ చర్చ్ రఘునాథపురం రోడ్డు, ఆలేరులో జరిగింది.  ఈ సందర్భంగా డాక్టర్ మద్దెల సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ భారతదేశంలోని క్రైస్తవ హక్కులను, మత సామరస్యాన్ని పెంపొందించడం, క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టడం. ఇది చర్చి నాయకులను ఏకం చేస్తూ, రాజ్యాంగపరమైన హక్కులను కాపాడటం, దళితులైన క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులం ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేయడం మరియు సామాజిక న్యాయం కోసం పోరాడటం, క్రైస్తవులపై జరిగే హింసాత్మక సంఘటనలపై చట్టపరంగా స్పందించి, బాధితులకు అండగా నిలవడం,  చర్చిలు మరియు వివిధ క్రైస్తవ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం మా సంస్థ యొక్క సిద్ధాంతాలని తెలిపారు.