09-06-2025 01:23:34 AM
500 మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లు హాజరు
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో హై రిస్క్ గర్భధారణపై ‘ప్రసూతి సవాళ్లను విజయగాథలుగా మార్చడం’ అనే అంశంపై జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ జాతీయ కాన్ఫరెన్స్కు దేశం లోని ప్రసిద్ధ జాతీయ గైనకాలజీ 500 మం ది వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సం దర్భంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ..
విభిన్న వైద్య విభాగాల నుంచి అను భవజ్ఞులైన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొ ని, హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణలోని ఇబ్బందులను అధిగమిస్తూ, నూతన మార్గదర్శ కాలు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను మరింత సులభంగా ఎలా నిర్వహించాలో తమ అనుభవాలు పంచుకున్నారని చెప్పారు. ప్రసూతి ఫలితాలను ఆప్టిమైజ్ చేయడంలో ఐసీయూ మద్దతు, పెరిపార్టమ్ అనస్థీషియా పాత్ర కీలకమని పవన్ పేర్కొన్నారు.
యశోద హాస్పి టల్స్- హైటెక్ సిటీ, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్. కృష్ణవేణి నాయిని మాట్లాడుతూ.. హై రిస్క్ ప్రెగ్నెన్సీపై జరిగిన ఈ కాన్ఫరెన్స్లో క్లిష్టమైన అంశాలపై లోతైన చర్చ జరిగిందన్నారు. ప్రసూతి సమయంలో అత్యంత క్లిష్టమైన గర్భధారణలో కూడా విజయవంతంగా తల్లీ బిడ్డలను క్షేమంగా కాపాడటం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
గర్భధారణ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి, గర్భధారణలో రుమటలాజికల్, ఎండోక్రైన్ రుగ్మత లు, ప్రసూతి సమయంలో అత్యవసర పరిస్థితులు, గుండె సమస్యలు మరిన్నింటితో స హా విస్తృత శ్రేణి క్లిష్టమైన అంశాలపై తల్లీ-బిడ్డలను సురక్షితంగా ఎలా కాపాడాలో లోతైన సెషన్లను నిర్వహించామన్నారు.
పెరుగుతున్న ప్రసూతి మరణాలు, హై రిస్క్ ప్రెగ్నె న్సీ కోమోర్బిడిటీలతో, మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్లో అన్ని విభాగాలు అత్యంత మెరుగైన సమన్వయంతో ఫలితాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని చపెప్పారు.