calender_icon.png 9 June, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి..

09-06-2025 01:25:53 AM

  1. ప్రాణాలు కాపాడిన కిమ్స్ కొండాపూర్ వైద్యులు

ఆఫ్రికాలో వ్యాపారవేత్తగా స్థిరపడిన కాకినాడవాసి

మలేరియా, డెంగ్యూ అనంతరం సెప్సిస్ సమస్యలు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): 60 ఏళ్ల వయసున్న ఉదయ్ స్వస్థలం కాకినాడ. 20 ఏళ్లకు పైగా ఆఫ్రికా ఖండం ఘనా దేశంలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. అక్కడే ఉండగా తీవ్రమైన మలేరియా, డెంగ్యూతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సెప్సిస్, ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రో మ్ (ఏఆర్డీఎస్) వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఊపిరి కూడా సరిగా అందేదికాదు.

దీంతో ఆయన చికిత్స పొందుతున్న హాస్పిటల్ వైద్యులు కిమ్స్ కొండాపూర్ డాక్టర్లను సంప్రదించగా, వీరి సూచనల మేరకు వెంటిలేటర్‌పై పెట్టి ప్రత్యేక విమానంలో కొండాపూర్ కిమ్స్‌కు తరలించారు. ఈ సంక్లిష్టమైన మిషన్‌ను డాక్టర్ డీవీ రామకృష్ణ, మెడికల్ ఆపరేషన్స్ బృందం సమన్వయంతో ప్లాన్ చేసి, అమలు చేసింది. ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రవిశేఖర్‌రెడ్డి, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ ఆయనకు చికిత్స అందించి ప్రాణా లు కాపాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఘనాలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఉదయ్‌ను చార్టర్డ్ విమానంలో ఇక్కడి తీసుకొచ్చాం. ఇందుకు 16 గంటల సమయం పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్పత్రికి చెందిన అన్ని వైద్య విభాగాల నిపుణులు ఉదయ్‌కు చికిత్స అందించారు. ’ అని పేర్కొన్నారు. ‘48 గంటల ముందస్తు ప్రణాళిక, క్లినికల్ సమన్వయంతో పనిచేశాం’ అని రీజనల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ విన్నమాల తెలిపారు.

చికిత్సలు అందించినవారి లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రవిశేఖర్‌రెడ్డి, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ పంకజ్,పల్మనాలజిస్ట్ అవినాష్, కార్డియాలజిస్ట్ పీ శ్యాంసుందర్‌రెడ్డి, నెఫ్రాలజిస్ట్ సీ శ్యాం సుందర్ రావు, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ పాటిల్ ప్రతీక్ యశ్వంత్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వెంకటేశ్ ఉన్నారు.