09-06-2025 01:21:49 AM
రాజేంద్రనగర్, జూన్ 8: విజిటింగ్ వీసా పై అక్రమంగా ఇద్దరు మహిళలను మస్కట్ పంపేందుకు యత్నించిన ఏజెంట్ను ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన ప్రకారం.. ఏపీ, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన లంకపల్లి మేరీ (35) 4 నెలల కింద మస్కట్లో ఉద్యోగం కోసం అదే జిల్లాకు చెందిన వీసా ఏజెంట్ ఆకుమర్తి సత్యనారాయణను సంప్రదించింది.
అతడు వర్క్ వీసా, పీవోఈ సర్టిఫికెట్, మెడికల్ క్లియరెన్స్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. మేరీ జూన్ 4న తన కొడుకుతో కలిసి తణుకు రైల్వేస్టేషన్కు వెళ్లగా, అక్కడ సత్యనారాయణ, మరో మహిళ కొండలమ్మ వచ్చి కలిశారు. జూన్ 5న హైదరాబాద్ చేరుకున్నారు. ఆరోజు రాత్రి సత్యనారాయణ, మేరీ, కొండలమ్మలకు పాస్పోర్టులు, విమాన టికెట్లు, మస్కట్ విజిట్ వీసాలు ఇచ్చి తాము సందర్శన కోసం వెళ్తున్నామని అధికారులకు చెప్పాలని సూచించాడు.
అయితే, ఇమిగ్రేషన్ కౌంటర్లో వారు నిజాన్ని వెల్లడించి, తాము పనిచేయడానికి వెళ్తున్నామ న్నారు. సత్యనారాయణ అనే వ్యక్తి మమ్నల్ని మస్కట్ పంపుతున్నాడని, అక్కడ సుందరం అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడని తెలిపారు. పీఓఈ లేకుండా విజిట్ వీసాపై వెళ్లి పని చేయడం చట్టవిరుద్ధమని ఇమిగ్రేషన్ అధికారులు వారికి వివరించారు.
సత్యనారా యణపై సదరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు న మోదు చేసి, నిం దితుడిని శనివా రం అరెస్ట్ చేసి రిమాండ్కు ప ంపారు. మస్కట్ లో ఉన్న ఏజెం ట్ సుందరం ఏర్పాటు చేస్తున్న ‘రోల్డ్ గోల్డ్ అం డ్ ఫ్యాన్సీ సెంటర్’కు శాంపిల్ రోల్డ్ గోల్డ్ ఆభరణాలను పంపించేందుకు ప్రయత్నించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు.
గల్ఫ్ దేశాలకు పీవోఈ (ప్రొటెక్టర్ అఫ్ ఇమిగ్రాంట్స్) సర్టిఫికెట్ లేకుండానే సత్యనారాయణ, ఒక్కొక్క మహిళ నుంచి రూ.1.5 లక్షలు తీసుకొని అక్రమంగా తరలిస్తున్నాడని విచారణలో తేలింది.