12-12-2024 01:19:01 AM
హైదరాబాద్, డిసెంబర్ 11(విజయక్రాంతి): ఎస్ఐ యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనిల్, సివిల్ కేసుల్లో రాజీ కోసం 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ) సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కార్యక్రమాన్ని ఫిజికల్గా, ఆన్లైన్లోనూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైకోర్టుతో పాటు తాలూకా కోర్టుల్లోనూ లోక్ అదాలత్ జరుగుతుందని చెప్పారు. కేసులను పరిష్కరించుకోవాలనుకునే వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, న్యాయసేవా సదన్, మండల న్యాయసేవా కమిటీలను సంప్రదించాలని సూచించారు.