23-06-2025 01:53:30 AM
- బోనాల సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు
- కల్తీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ఎక్సుజ్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో జూన్ 29 నుంచి జూలై 21 వరకు బోనాల జాతర సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయని వ్యాపారులు, ఎక్సుజ్ శాఖ అంచనా వేస్తున్నాయి.
అయితే, జాతరను అడ్డుపెట్టుకొని కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు జరగకుండా ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గట్టి నిఘా పెట్టింది. గత సంవత్సరం కంటే ఈసారి అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తూ, అవసరమైన స్టాకును సమకూర్చుకోవడానికి మద్యం వ్యాపారులు సన్నాహాలు చేపట్టారు.
అయితే జాతర సందర్భంగా కల్తీ మద్యం, ఫ్యూరియస్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగం పెరిగే అవకాశం ఉందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ శాఖలను ఎన్డీపీఎల్ మద్యం పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
గతంలో నమోదైన కేసులు
2023లో మొత్తం 176 ఎన్డీపీఎల్ కేసులు నమోదు కాగా, ఒక్క బోనాల జాతర జరిగిన జూలైలోనే 78 కేసులు నమోదయ్యాయి. 2940 లీటర్ల మద్యం సీజ్ చేస్తే, జూలైలో 1845 లీటర్ల మద్యం పట్టుబడింది. 2023లో 133 కేసులు నమోదు కాగా, 2024లో ఈ సంఖ్య 482కి చేరింది.
సీజ్ చేసిన మద్యం సైతం 932 లీటర్ల నుంచి 2937 లీటర్లకు పెరిగింది. ఈ గణాంకాల నేపథ్యంలో, ఈసారి బోనాల జాతర సందర్భంగా ఎక్సుజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించాయి.
ఎక్సుజ్ శాఖ అమ్మకాల గణాంకాలు
2024 ఆర్థిక సంవత్సరంలో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మద్యం అమ్మకాలు బోనాల జాతర సమయంలో గణనీయంగా పెరిగాయి. జూన్లో 30.24 లక్షల లిక్కర్ పెట్టెలు, 39.94 లక్షల బీరు పెట్టెలు అమ్ముడయ్యాయి. జూలైలో 31.80 లక్షల లిక్కర్ పెట్టెలు, 47.94 లక్షల బీరు పెట్టెలు (బోనాలు జరిగిన నెల) అమ్ముడుయ్యాయి.
ఆగస్టులో 30.86 లక్షల లిక్కర్ పెట్టెలు, 39.77 లక్షల బీరు పెట్టెలు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలు బోనాల జాతర జరిగిన జూలైలో లక్ష నుంచి లక్షన్నర పెట్టెల లిక్కర్, బీరు అమ్మకాలు అధికంగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి.
దాడులు నిర్వహిస్తున్నాం
హైదరాబాద్లో ఇప్పటికే ఎన్డీపీఎల్పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పెద్ద మొత్తంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పట్టుకున్నామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం తెలిపారు.
మరో పక్క డిఫెన్స్ లిక్కర్పై కూడా ప్రత్యేక దృష్టితో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. బోనాల జాతర సందర్భం గా ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ రా కుండా గట్టి నిఘా పెడతామని, స్థానికంగా ఫ్యూరియస్ లిక్కర్ను అరికట్ట డానికి అన్ని చర్యలు చేపడుతామని వెల్లడించారు.