calender_icon.png 23 June, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి

23-06-2025 01:55:09 AM

టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం

కామారెడ్డి, జూన్ 22,(విజయ క్రాంతి) : బడులు ప్రారంభమై చదువులు సజావుగా సాగాల్సిన సమయంలో పైరవీ,పలుకుబడి విధానంలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయుల అత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. వెంటనే ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని, పర్యవేక్షణ చేయుటకు టీచర్లను నియమంచడం సరైనది కాదన్నారు.

టీపీటీఎఫ్ రాష్ట్ర సిహెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 21 తేది న హైదరాబాదులోని పర్వానా హాల్ నందు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ఆర్భాటంగా ముందుకు తీసుకు వస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, టి.పి.ఎస్, టి.యఫ్.యస్ పాఠశాల ఏర్పాటు ప్రస్తుత విద్యా విధానానికి ప్రత్యామ్నాయం కాదని, విప్లవాత్మకమైన మార్పులు రావని, ఉన్నోడి పిల్లలైనా, లేనోడి పిల్లలైనా ఒకే బడిలో చదువుకునే ఏర్పాట్లు ఉండాలని,

అందుకు అంతరాలు లేని కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని విద్య ప్రభుత్వ ఆధీనంలో నడుపబడినప్పుడు మాత్రమే తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ నుండి విముక్తి లభిస్తుందన్నారు. తక్షణంగా ప్రతి ఉన్నత పాఠశాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ఒక్క డీఏ తో సరిపెట్టుకోవడం సరికాదని, క్యాబినెట్ నిర్ణయాలను అన్నిటిని వెంటనే అమలుచేయాలని, ప్రభుత్వం చెప్పినట్లుగా పెండింగ్ బిల్లులకు సంబంధించి జూన్ నెలకు రూ.700 కోట్లను విడుదల చేయాలని,హెల్త్కార్డులు సక్రమంగా పనిచేసేలా న్యూహెల్త్ స్కీమ్ను తీసుకొచ్చి ట్రస్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

వీటికి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్నెబోయిన తిరుపతి కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు హాజరైన కార్యవర్గ సభ్యులు నివేదిక లోని ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు, సామాజిక అంశాలు, సంస్థ చేపట్టిన ఉద్యమాలు, చేసిన ప్రాతినిధ్యాలపై క్షుణ్ణంగా చర్చించి ఆమోదించారు.

తెలంగాణ రాష్ట్రంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు కోరుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ ను నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలుజరపాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.

ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులు, ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు యం.ప్రకాశ్ రావు ,రాష్ట్ర ఉపాధ్యక్షులు పి మహేందర్ రెడ్డి,పి.నారాయణమ్మ,డి శ్రీనివాస్ ,యం.లక్ష్మయ్య యాదవ్ ,ఎం కృష్ణారెడ్డి, కార్యదర్శులు ఎస్.విజయ్ ,వై.పద్మ , బి.రమేష్ యస్.కవిత,ఆర్.రమేష్,డి.రాజయ్య పాల్గొన్నారు.