03-06-2025 01:10:39 AM
ఘట్ కేసర్, జూన్ 2 (విజయక్రాంతి) : ఎన్ సీ సీ క్యాండెట్ల బెటాలియన్ శిక్షణ శిబిరం పో చారం మున్సిపల్ దివ్య నగర్ లోని నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్లో గత నెల 27 నుండి నిరవధికంగా కొనసాగుతుంది. ఈనెల 5వ తేదీన ముగించనున్న శిక్షణ శిబిరంలో 750 మంది ఎన్ సీ సీ కాండేట్లు శిక్షణ పొందుతున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 1న ఎన్ ఎన్ ఆర్ ఈ సి ఎం డైరెక్టర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో యోగ శిక్షణను అందించారు ఈ శిక్షణ శిబిరాన్ని కాల్నల్ ఎంఎస్ కుమార్ సందర్శించి కాండేట్లకు అన్ని సదుపాయాలు అందిస్తున్నందుకు కళాశాల మరియు స్కూల్ సెక్రటరీ నల్ల మల్లారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ రియల్ టైం హీరోస్ అనే అంశంపై ప్రసంగిస్తూ ఎన్ సీ సీ క్యాండెట్లు ఎల్లప్పుడూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని చెప్పారు విధి నిర్వహణ విపత్తుల నిర్వహణలో పలు సమస్యలను తీరికగా టెక్నాలజీ వినియోగం ద్వారా అధిగమించవచ్చని చెప్పారు.
కళాశాల మరియు పాఠశాల విద్యార్థులను సమాజసేవ మాతృభూమి రక్షణకు కార్యోనుముకులను చేసే విధంగా ఎన్ సి సి ఏర్పాటు అయ్యిందని తెలిపారు. శరీరక మానసిక వికాసం తో పాటు భవిష్యత్తులో త్రివిద్య దళాలలో చేరి దేశ సేవ చేసే అవకాశం సి సి క్యాండిడేట్లకు ఉంటుందన్నారు. ఈ శిక్షణ శిబిరంలో వివిధ రంగాలకు చెందిన ప్రొఫెసర్లు ఎన్ సీ సీ అధికారులు పాల్గొన్నారు. ఆర్మీ ఎంపికలు, ఫైర్ సేఫ్టీ డ్రిల్ విపత్తుల నిర్వహణ విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిఫెన్స్ టెక్నాలజీస్ పై తమ విజ్ఞానాన్ని అనుభవాలను పంచుకున్నారు.