04-12-2024 12:00:00 AM
కె. రామకృష్ణ
‘ప్రతి కుటుంబం ముగ్గురు సంతానాన్ని కలిగి ఉండాలి’ అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఇచ్చిన పిలుపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిం ది. దేశంలో ఇప్పుడున్న జనాభాకే పౌష్టికాహారం, ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవ కాశాలు లేవని, ఇక జనాభా మరింతగా పెరిగితే పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటు ందంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. ఇంతకీ, భగవత్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏమిటి? ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్లో జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. ‘ప్రతి కుటుంబం సమాజంలో భాగమే. సమాజాభివృద్ధికి కుటుంబాల పాత్ర ఎంతో అవసరం. జనాభా క్షీణత కారణంగా ఇప్పటికే అనేక భాషలు, సంస్కృతులు అంత రించి పోయాయి. ఎందుకంటే తక్కువ జనన రేటు ఉన్న ఏ సమూహమైనా చివరికి అంతరించి పోతుంది’ అని అన్నారు. సమాజంలో జనాభా తగ్గుదలను విధ్వంసంగా అభివర్ణించిన భగవత్ ఇది బయటి నుంచి రాదని, ఎలాంటి విపత్తు లేకుండానే దానంతట అదే జరుగుతుందని చెప్పారు. 1998 లేదా 2002లో రూపొందించిన దేశ జనాభా విధానంలో ఏ సామాజిక వర్గం జనాభా 2.1 శాతానికి తగ్గకూడదని నిర్దేశించారు. అంటే, ఒక కుటుంబానికి కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని భగవత్ వివరించారు.
‘మేమిద్దరం, మాకిద్దరు’ పాత మాటేనా?
భగవత్ కొంత కాలంగా జనాభా పెరుగుదల ఆవశ్యకత గురించి మాట్లాడుతూనే ఉన్నారు. జనాభా పెరుగుదల, మతపరమైన జనాభా ఈ రెండూ విస్మరించడా నికి వీల్లేనివని ఆయన అభిప్రాయ పడ్డ్డా రు. ప్రతి కోణంలో ఆలోచించి అన్ని వర్గాలకు వర్తించేలా నూతన జనాభా విధానా న్ని రూపొందించాలని ఆయన సూచించారు. వివిధ వర్గాల జనాభాలో అసమతౌ ల్యం, భౌగోళిక సరిహద్దులను ప్రభావితం చేస్తుందని భగవత్ వ్యాఖ్యానించారు.
ముస్లిం జనాభా పెరుగుతుండడం, అదే సమయంలో కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం కారణంగా హిందూ జనాభా తగ్గిపోతూ ఉండడం భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణంగా ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించే వారు అంటున్నారు. అయినప్పటికీ దేశం లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతుండడం, ఆ మేరకు ఆందోళన కలిగి స్తున్న మాట వాస్తవం. ఒక మహిళ 15 ఏండ్లనుంచి 49 ఏండ్ల మధ్య వయసులో జన్మనిచ్చే పిల్లల సగటును సంతానోత్పత్తి రేటుగా లెక్కగడతారు. 1950 దశకంలో దేశంలో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేది.
అధిక జనాభా కారణంగా ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తడంతో 1951 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రపంచంలో జాతీయ కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలు చేసిన తొలి దేశం మనదే కావడం గమనార్హం. ‘మేమిద్దరం, మాకిద్దరు’ అనేది ఒకప్పటి నినాదం. ‘ఒకరు లేదా ఇద్దరు ముద్దు, అంతకు మించి వద్దు’ అని కూడా గతంలో ప్రభుత్వాలు ప్రచారాలు చేయడం మనం చూశాం.
‘వృద్ధ భారతం’ కాకుండా ఉండాలంటే?
దేశ జనాభా విపరీతంగా పెరిగి పోతుండడంతో నియంత్రణ కోసం ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టిన రోజు ల్లో వినిపించిన నినాదాలు ఇవి. ఇద్దరిని మించి పిల్లల్ని కనవద్దంటూ ప్రభుత్వాలే ప్రచా రం చేశాయి. అంతేకాదు, అధిక సం తానం కలిగి ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయాడానికి అనర్హులుగా ప్రకటించడంతోపాటు తక్కువ సంతానం కలిగిన ఉద్యోగు లకు ఇంక్రిమెంట్ల్లు ఇవ్వడం లాంటి ప్రోత్సాహకాలూ ప్రకటించాయి. ముఖ్యం గా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి.
ఫలితంగా క్రమంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వచ్చింది. అయితే, ఈ తగ్గుదల మరీ ఎక్కువగా ఉండడమే ఇప్పుడు సమస్యగా మారింది. జనాభా తగ్గకుండా ఉండాలంటే సంతానోత్పత్తి సగటున 2.1గా ఉం డాలి. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో 31 రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంతాన రేటు 2.1కు, అంతకన్నా దిగువకు పడిపోయింది. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలు మాత్ర మే సగటు స్థాయికి ఎగువన ఉన్నాయి. బీహార్ 4.0తో అగ్రస్థానంలో ఉంది. 2019 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0 రీప్లేస్మెంట్ స్థాయి దిగువకు తగ్గినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మోహన్ భగవత్ పిలుపు వెనుక ముఖ్య ఉద్దేశం ఇదేననేది ఆయనను సమర్థిస్తున్న వారి వాదన.
భారత్లో సంతానోత్పత్తి రేటు ఇదే విధంగా కొనసాగితే 2050 నాటికి 1.29కు పడిపోతుందని ఇటీవల లాన్సెట్ జరిపిన ఓ అధ్యయనంలో తేలిం ది. అంటే ప్రస్తుతం ‘యువ భారతం’గా ఉన్న దేశం మరో మూడు దశాబ్దాల్లో ‘వృద్ధ భారతం’గా మారడంతోపాటు దేశ జనాభా కూడా తగ్గిపోతుంది. ఇదే జరిగితే ఇప్పుడు దేశానికి వెన్నుదన్నుగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. వృద్ధుల జనాభా పెరగడం వల్ల వైద్యసేవలు, పింఛన్ల వ్యవస్థపై భారం పెరుగుతుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియాలాంటి దేశాలు ఇప్పుడు ఇదే సమస్య ను ఎదుర్కొంటున్నాయి. అందుకే, ఇప్పు డు ఎక్కువమంది పిల్లల్ని కనమంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి.
మారిన దృక్పథాల నడుమ..
జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల ఎక్కువమంది పిల్లలను కనేందుకు నేటి యువ దంపతులు వెనుకాడుతుండడం సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ప్రధాన కారణం. వివాహాలు ఆలస్యంగా చేసుకోవడం, మానసిక ఒత్తిళ్లు, జీవన శైలి, వాతా వరణ సంబంధ సమస్యల కారణంగా వంధ్యత్వం పెరగడమూ మరో కారణం. సంపాదనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో కుటుంబ వ్యవస్థలు దెబ్బ తినడం కూడా పరోక్షంగా దీనికి దోహదపడుతోంది. ఎక్కువమంది పిల్లల్ని కంటే వారి బాగోగులు చూసుకోవడం సమస్యగా మారు తుందని, అప్పుడు తాము ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితం కావలసి వస్తుందని చాలామంది మహిళలు భయపడుతు న్నారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం, చిన్న కుటుంబాలు, వేరు కుటుంబాలు తయా రు కావడంతో సమస్య ఎదురవుతోంది.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్న పిల్లల ఆలనా పాలన ఇంట్లో ని నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు చూసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావించే వారు ఎక్కువయ్యారు. ‘అలాంటి వారికి భగవత్ మాటలు రుచిస్తాయా?’ అనేది ప్రశ్న. ఎక్కువమంది పిల్లలను కనడం వల్ల కలిగే ప్రయోజనాలను రాజకీయ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ గురించి ప్రతి సంద ర్భంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లుకూడా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రజలకు పిలుపునిస్తున్నా రు. దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నీకూడా అధిక సంతానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
ఎందుకంటే, రాబోయే రోజుల్లో నియోజక వర్గాల పునర్విభజన కారణంగా దేశంలో లోక్సభ సీట్లు ఇప్పుడున్న 543 నుంచి 750 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుండగా, జనాభా నియంత్రణను పటిష్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ విషయంలో నష్టపోనున్నాయి. జనాభా నియంత్రణను పటిష్టంగా అమలు చేసిన తమను ఈ విధంగా శిక్షించడం భావ్యం కాదంటూ దక్షిణాది రాష్ట్రాలు గత కొంతకాలంగా కేంద్రం ముందు వాదిస్తున్నాయి.
అయితే, భగవత్ పిలుపుపై ప్రతిపక్షాలు, మహిళా నేతలు మాత్రం మండి పడుతున్నారు. మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూడవద్దని, ఎంతమందిని కనాలనేది వారి ఇష్టానికే వదిలేయాలని మహిళా సంఘాల నేతలు అంటుంటే, ఇలాంటి వివాదాలను లేవనెత్తి సమాజంలో చిచ్చు పెట్టవద్దని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ నేత భగవత్ ఇచ్చిన పిలుపు దేశంలో ఓ తేనెతుట్టెను కదిపిందనేది నిజం. రాబోయే రోజుల్లో ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.