05-12-2024 12:00:00 AM
రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో ఎందరో మాహనీయుల జయంతి, వర్థంతి వేడుకలు జరుపుకోవడం మన సాంప్రదాయం. వీటిని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు, వివిధ శాఖల కార్యాలయాలలోనూ నిర్వహించడం ఆనవాయితీ. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వీరి చిత్ర పటాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో తండాలు, గ్రామాలు పంచాయతీలుగా కొన్ని మండలాలుగా, మరికొన్ని పట్టణాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి.
నూతనం ప్రభుత్వమైనా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా దేశ, రాష్ట్ర నాయకుల ఫొటోలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఘన చరిత కలిగిన నాయకుల చిత్ర పటాలను ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలి.
- కామిడి సతీశ్రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా