27-05-2025 12:00:00 AM
గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్
ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గీత కార్పొరేషన్ ద్వారానే నీరా కేఫ్ను నిర్వహించాలని, టెండర్ను రద్దు చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబు ల్ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 18వ తేది వరకు జనగామ జిల్లాను పాపన్న జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బ్ంప సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న గీతన్నల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. నందనం నీరా పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని గీతాన్నలకు కొత్త ఫెన్షను ఇవ్వాలన్నారు.
ఉత్తర తెలంగాణలో గీత వృత్తిదారులపై జరుగుతున్న విడిసీల దాడులను ఆరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు10 లక్షల రూపాయల ఎక్స్రేషియో, ఆరోగ్య కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు నక్క కృష్ణ గౌడ్, సర్వాయి పాపన్న మోకు దెబ్బ అధ్యక్షులు జక్క వీరస్వామి, బీజేపీ గీత సెల్ అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్, జై గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు బురా మల్సూర్, సోషల్ డెమొక్రటిక్ జాతీయ అధ్యక్షులు కోల జనార్ధన్, శ్రీకాంత్ గౌడ్, కూరెల్ల వేములయ్య, బొనగాని యాదగిరిగౌడ్, ముద్ద గౌని రాంమోహన్ గౌడ్, పరశురాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.