20 March, 2026 | 9:21 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నీట్‌పై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి

06-07-2024 02:02 AM

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, జూలై 5 (విజయక్రాంతి): నీట్ లీకేజీలో రూ.కోట్లు చేతులు మారాయని, అవకతవకలపై సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ చేయించాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ లీకేజీ విచారణ సీబీఐ చేతిలోకి వెళ్లిందన్నారు. సీబీఐ కేంద్ర ప్రభుత సంస్థగా మారిందని, కేంద్రానికి సీబీఐ అనుకూలంగా రిపోర్ట్ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుతం చెలగాటం ఆడుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో  విచారణ చేయిస్తేనే నిజానిజాలు వెల్లడవుతాయ న్నారు. పరీక్ష నిరహణలో పారదరకత లోపించిందని ఆయన విమర్శించారు.