5 May, 2026 | 4:39 PM

నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

05-05-2026 03:33 PM

నర్సరీని పరిశీలిస్తున్న సర్పంచ్ కృష్ణాజి 

వాంకిడి,(విజయక్రాంతి): నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగ్గదని బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. మంగళవారం గ్రామంలో నర్సరీని పరిశీలించి మాట్లాడారు. మొక్కలు ఎండిపోకుండా రెండు పూటల నీరు పట్టాలని, నర్సరీ నిర్వాహకులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ అవసరమో అక్కడ మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

గ్రామ పంచాయతీని పచ్చటి పందిలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులు తమ తమ పొలాల వద్ద మొక్కలు పెంచుకోవాలని అనుకునే రైతులు.. ఉపాధి హామీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధర్మయ్య, కాంగ్రెస్ నాయకుడు మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.