1 July, 2026 | 8:04 PM

Breaking News

ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం

05-05-2026 03:36 PM

సంబరాలు జరుపుకున్న ఎంపీడీవో,ఎంపీవో, కార్యదర్శిలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డి పెట్ మండలం మొదటి స్థానంలో ఉందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలు కామారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నందున మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రభాకర్ చారి,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కార్యదర్శులు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్కు శాలువాతో సన్మానించి కేకు కట్ చేశారు.నాగిరెడ్డిపేట్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చురుకుగా జరిగేందుకు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయడం  వల్లే నాగిరెడ్డిపేట్ మండలం కామారెడ్డి జిల్లాలో ముందు ఉందని కార్యదర్శులు తెలిపారు.

నాగిరెడ్డిపేట్ మండలంలో 363 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు అందులో 355 ఇండ్లు మార్కౌట్లు ఇవ్వగా, బిస్మిట్ లేబర్లో 72 ఇండ్లు ఉన్నాయని, రూప్ లెవెల్లో 43 ఇండ్లు పనులు కొనసాగుతున్నాయని, స్లాబ్ లేవలో 137 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఇప్పటివరకు నాగిరెడ్డిపేట మండలంలో 62 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశం చేశారని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలం కామరెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో మొదటి స్థానంలో ఉన్నందున మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు.