03-06-2025 07:49:28 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పంచాయితి కార్యదర్శులందరు కలిసి మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పి. కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎ. రాజేందర్, డి. సరిత లను నియమించారు. జనరల్ సెక్రటరీగా కే.సుధాకర్, క్యాషియారుగా గోపి కృష్ణ, ట్రెజరర్ గా సీ.ఎచ్ ప్రేమలత, మీడియా కోఆర్డినేటర్ గా యూ.కృష్ణ మొత్తం ఎనిమిది మంది సభ్యుల పేర్లు తీర్మానించుకున్నారు. అనంతరం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా నియామకమైన పి.కిరణ్ కుమార్ కు శాలువా తో సన్మానించారు.