29 June, 2026 | 6:26 PM

ఓదెల ఆలయానికి కొత్త పాలకవర్గం

01-08-2025 12:00 AM

పెద్దపల్లి, జూలై 31(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఓదెల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్ర మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తాజాగా కొత్త పాలకవర్గాన్ని నియమించిం ది. పాలకవర్గ సభ్యులను ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య ను నూతన పాలకవర్గ సభ్యులు జంగం కొమురయ్య, కోదాటి మనోహర్రావు, జీలుక రవీందర్, క ట్కూరి సమ్మిరెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, నాగపురి రవి గౌడ్ , చీక ట్ల మొండయ్య, తీర్థాల రాజారం, వీరవేని రవి, ఉప్పుల శ్రావణ్ కుమార్, గంటా రమే ష్, సామల యమున లను ఘనంగా సన్మానించారు.

పాలకవర్గం సభ్యులను ఎమ్మెల్యే అభినందిస్తూ శుభాకాంక్షలు తెలయజేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ... పెద్దపల్లి జిల్లాకు ప్రసిద్ధి చెందిన ఓదెల మల్లన్న ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తోందని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యే యంగా పనిచేస్తామన్నారు.

పాలకవర్గ సభ్యు లు సేవా భవంతో పనిచేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు పాటుపడాలని సూ చించారు.ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులతో పాటు ఓదెల, సుల్తానాబాద్ మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, సీ నియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, జిల్లా పద్మశాలి సేవ సంఘం నాయకులు  పాల్గొన్నారు.