17 April, 2026 | 3:25 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నిజాయితీ చాటుకున్న నిర్మల్ కండక్టర్

20-04-2025 05:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): జగిత్యాల నుండి నిర్మల్ కు ప్రయాణిస్తున్న జగిత్యాల వాసి గుగ్గిల మనోజ్ఞ నిర్మల్ డిపో బస్సు TS18T 4456 లో చేతి పర్సు సీటుపై పెట్టి మరిచిపోయారు. డిపోలో బస్సును అప్పగించేటప్పుడు కండక్టర్ శ్యామల 851334 కు పర్సు కనబడింది. డిపో క్లర్క్ కు అప్పగించారు. అందులో 20000/- రూ..ల విలువచేసే చెవి కమ్మలు ఉన్నాయి. ప్రయాణికురాలిని డిపోకు పిలిపించి డిపో క్లర్క్ ఎన్. ఆర్ శేఖర్ అప్పచెప్పడం జరిగింది. నిజాయితీగా బంగారాన్ని అప్పచెప్పిన కండక్టర్ డ్రైవర్ లను డిపోమేనేజర్ కే.పండరి అభినందించారు.