23-06-2025 01:13:48 AM
రోడ్డు ఇరువైపుల ఆక్రమణలు
పట్టించుకొని ఆర్ అండ్ బి అధికారులు
అశ్వారావుపేట, జూన్ 22 (విజయ క్రాంతి) : తల్లాడ నుండి దేవరపల్లి వెళ్ళే రాష్ట్ర రహదారి గురించి సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా మర్చిపోయారు అని చెప్పచ్చు. అసలు ఈ రహదారి నీ పర్యవేక్షేందుకు అధికారులు ఉన్నారా అనే అనుమానాలు పలు రకాల వాహనదారులకు వస్తుంది.మరి ఎక్కువగా సత్తుపల్లి, అశ్వారావుపేట మధ్య ఉన్న 35 కిలో మీటర్ల నిడివి లో రోడ్డుకు ఇరువైపుల ముళ్ళ పొదలు, తుప్పలు,గడ్డి పెరిగి బి టి రోడ్డుకు ఇరువైపుల ఉండే వైట్ లైన్ వరకు ఆక్రమించుకున్నాయి.
రాష్ట్ర రహదారికి ఇరువైపుల కొన్ని చోట్ల లోతుగాను, మరి కొన్ని చోట్ల రోడ్ కంటే ఎత్తుగా మట్టి ఉండటం తో నర్సరీల్లో మొక్కలకు పెట్టే నీరు, వర్షం పడితే వర్షం నీరు రోడ్డు పక్కన కాకుండా నడి రోడ్డు మీద ప్రవహిస్తుంది. నారంవారిగూడెం సమీపం లోని ఆయిల్ పామ్ నర్సరీ నుండి రంగాపురం దుర్గమ్మ గుడి వరకు వరద నీరు రహదారిపై ప్రవహించటం తో ద్విచక్ర వాహనదారులు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సత్తుపల్లి నుండి అశ్వారావుపేట మద్యలో ఉన్న పలు గ్రామాల్లో బిటి రోడ్డు ఇరువైపుల ఆక్రమిం చి వ్యాపారులు షెడ్లు ఏర్పాటు చేసుకోవటంతో, ఆర్టిసీ బస్సులు నడి రోడ్డు మీద ఆపవలసి వస్తుంది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వటం, ప్రమాదాలకు కారణం అవుతుంది. రోడ్డు పక్కన స్థలం లేకపోవటం తో లారీలు ఓవర్ టేక్ చేసే సమయం లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను ఢీ కొని అనేక మంది మృత్యువాత పడుతున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర రహదారి నిర్వహణ అధికారులు, పోలీస్ శాఖ సంయుక్తంగా రోడ్డు పక్కన ఉన్న పొదలు తొలగించి, పేరుకుపోయిన మట్టిని తొలిగించాలని వాహనదారులు కోరుతున్నారు. వాటి తో పాటు రాష్ట్ర రహ దారి ఆక్రమించిన స్థలాలను ఖాళీ చేయించి, ఆర్ టి సి బస్సులను ప్రయాణికులకు సౌకర్యంగా , రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులు బస్సు ఎక్కి దిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహన దారులు కోరుతున్నారు.