02-12-2025 08:38:59 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో రేపు నిర్వహించే మూడో విడత నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం అన్నారు. స్థానిక మండల పరిషత్లో రెండు కౌంటర్లు, పక్కనే ఉన్న రైతు వేదిక కేంద్రంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ శారద సబ్ కలెక్టర్ ఉమ హారతిని చెప్పారు. నామినేషన్ హాల్లో అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అనుమతి ఇవ్వాలని స్టేజ్ 1 అధికారులకు సూచించారు.