27 June, 2026 | 7:36 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 43 పాఠశాలలకు నోటుబుక్స్ పంపిణీ

27-06-2026 06:25 PM

కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి స్ఫూర్తి ఫౌండేషన్ మరోసారి చేయూతనందించింది. ఫౌండేషన్ ధాతల సహకారంతో మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో ప్రతి విద్యార్థికి 5 నోటుబుక్స్ చొప్పున పంపిణీ చేశారు. మొత్తం 43 పాఠశాలలకు ఈ నోటుబుక్స్ అందజేయడం జరిగింది.

పంపిణీ కార్యక్రమంలో భాగంగా 43వ పాఠశాలైన హనుమాతండా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ పాఠశాల కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ దారవత్ మోహన్ నాయక్ సొంత గ్రామంలో ఉండటంతో, ఆయన స్వయంగా హాజరై విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చైర్మన్ సూచించారు.స్ఫూర్తి ఫౌండేషన్ చేస్తున్న సేవలను గ్రామస్తులు అభినందించారు.