16 March, 2026 | 5:37 AM

కృతుంగకు నోటీసులు

08-11-2024 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): మూసాపేటలోని కృతుంగ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పరిశుభ్రత లేని వంట గదితో పాటు బొద్దింకలు సంచరించడాన్ని, ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్న నా ణ్యత లేని వస్తువులను అధికారులు గుర్తించారు.

రెస్టారెంట్ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందకపోవడం గుర్తించి యాజమాన్యానికి నోటీసులు అందజే శారు. పలు ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు.