8 June, 2026 | 7:55 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

సేవలు అందించడంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు

07-11-2024 06:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పౌరులకు అందించే వివిధ సేవలను సత్ఫరం అందించాలని సేవలు అందించడంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తింపు పత్రాల జారీలో జాప్యం చేయడం వల్ల కొందరికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయని తెలిపారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వెంటనే పరిశీలన చేయాలన్నారు, పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి పౌర సేవలను ప్రామాణికంగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.