15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రగ్బీ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ కు తృతీయ స్థానం

30-06-2025 10:43 PM

జావేద్ హుస్సేన్కు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): జీఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్(Rugby Premier League) తొలి సీజన్లో హైదరాబాద్ హీరోస్(Hyderabad Heroes) మూడో స్థానాన్ని కైవసం చేసుకుందని హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మాన్యుయెల్ మోరెనో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్(Bengaluru Bravehearts)తో జరిగిన వర్గీకరణ పోరులో 17-12 తేడాతో గెలిచిందన్నారు. ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలో నిలిచిన హీరోస్ జట్టు అందుకు తగ్గట్టుగా ఆడిందన్నారు. గాయాల కారణంగా జావేద్ హుస్సేన్, టెరియో తమాని, లౌతారో బజన్ వెలెజ్ వంటి కీలక ఆటగాళ్ల సేవలు లేకుండానే ఈ పోరులో స్థిరంగా ఆడి బ్రేవ్‌హార్ట్స్ ను ఓడించిందన్నారు. కెప్టెన్ మోరెనో, జోజి నసోవా, కెవిన్ వెకేశా, భూపిందర్ సింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.