21-06-2025 11:27:11 PM
వైరా నుంచి ఖానాపురం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ..
తెలంగాణలో టిడిపి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి..
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు..
వైరా (విజయక్రాంతి): వైరా మండల(Wyra Mandal) పరిధిలోని ఖానాపురం గ్రామంలో పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు డైరెక్టర్ నన్నురి నర్సిరెడ్డి వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పార్టీ ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథంలు ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైరా మండల కేంద్రం నుంచి ఖానాపురం గ్రామం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిల్ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బక్కని నరసింహులు టిటిడి బోర్డు డైరెక్టర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ... స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చారని నిరుపేదల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో నిలిచిపోయాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తెలుగుదేశం పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకూరు చలపతిరావు మండల అధ్యక్షులు సురేందర్ వైరా పట్టణ అధ్యక్షుడు బొల్లినేని శ్రీనివాసరావు తాత సుధాకర్ ఖానాపురం గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దపోలు రామకృష్ణ గాలి రామకృష్ణ కట్ట రంగారావు, వీరపు నేని కిషోర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి ఎస్ కే రఫీ మౌలాలి తెలుగు మండల అధ్యక్షుడు పత్తిపాటి సురేష్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.