22-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21, (విజయక్రాంతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణలో ఒక విప్లవాత్మక మార్పు తెస్తోంది. ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం అనే అంశంపై దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సదస్సును శనివారం యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీలో నిర్వహించారు.
ఈ కార్యక్ర మాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గోరుకంటి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ప్రపం చవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, వైద్య పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఏఐ సాంకేతిక నిపుణులు సహా 1000 మందికి పైగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. సాంకేతికతతో కూడిన రోగి సంరక్షణ, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థను నిర్మించుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో కీలకం అని వ్యా ఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండటానికి కట్టుబడి ఉం టుందని చెప్పారు.
యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ గోరుకంటి రవీందర్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణలో సంక్లిష్టమైన వైద్య-ఆరోగ్య సంరక్షణ డేటాను విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి కృత్రిమ మేధ ఎంతగానో ఉపయో గపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐని ఉపయోగించడంలో కొన్ని నైతిక, సామాజిక సమస్యలు కూడా ఉన్నాయన్నారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, క్లినికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లి మాట్లా డుతూ.. “ఏఐ ఆరో గ్య సంరక్షణలో ఒక విప్లవాత్మకమైన చారిత్రక మార్పు. క్లినికల్ ప్రాక్టీస్లో కూడా కృత్రి మ మేధస్సు అద్బుతాల్ని సృష్టిస్తుంది” అని చెప్పారు.
ఎన్నో ప్రాణాంతక వ్యాధులను తొలిదశలోనే గుర్తించడంవల్ల వాటికి సరైన సమయంలో అత్యుత్తమ చికిత్స మరియు వ్యాధి నివారణలో కూడా మనం ఎంతో ప్రగతి సాధిం చవచ్చు అన్నారు. ఈ సదస్సులో డయాగ్నస్టిక్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఏఐ -ఎనేబుల్ పర్సనలైజ్డ్ ఆంకాలజీ, ఏఐ -డ్రివెన్ రోబోటిక్ ప్రెసిషన్ సర్జరీ, ఫార్మా మరియు హాస్పిటల్ ఆపరేషన్లలో ఇన్నోవేషన్, ఎథికల్ ఏఐ, పబ్లిక్ హెల్త్, పాలసీ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు డాక్టర్ చినబాబు తెలియజేశారు.