22-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21(విజయక్రాంతి): మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ యోగా వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసగించారు. నేటి ఆధునిక జీవనశైలికి వ్యతిరేకంగా యోగా ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.
యోగాను జీవితాంతం కొనసాగించాలన్న నిశ్చయంతో ఉండాలని పేర్కొన్నారు. ఈమేరకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ యోగా సెషన్లో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన యోగా నిపుణులు యోగాను అనుసరించడం వల్ల శాస్త్రీయంగా కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు అందజేశారు.