8 May, 2026 | 4:14 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి

08-05-2026 03:34 PM

ప్రతి పంచాయతీలో కనీసం 150 మంది పనికి రావాలి

డీఆర్‌డీవో దత్తారావు

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధి హామీ పనుల్లో కార్మికుల హాజరు పెంచి, ప్రతి కూలీకి కనీసం రూ.300 వేతనం వచ్చేలా పనులు నిర్వహించాలని డీఆర్‌డీవో దత్తారావు సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఫ్లడ్ డైవర్షన్ డ్రెయిన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన పంచాయతీలోని ప్రతి కార్మికుడు ఉపాధి హామీ పనులకు హాజరై పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరారు. సగటు వేతనం కనీసం రూ.300 వచ్చే విధంగా పనుల ప్రణాళిక ఉండాలని తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 150 మంది కార్మికులు పనులకు వచ్చేలా లేబర్ ఇంప్రూవ్‌మెంట్ చర్యలు చేపట్టాలని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులను ఆదేశించారు. పనుల నాణ్యతతో పాటు కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ సంగీత లచ్చన్న, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.