18 August, 2026 | 4:53 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి

08-05-2026 03:34 PM

ప్రతి పంచాయతీలో కనీసం 150 మంది పనికి రావాలి

డీఆర్‌డీవో దత్తారావు

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధి హామీ పనుల్లో కార్మికుల హాజరు పెంచి, ప్రతి కూలీకి కనీసం రూ.300 వేతనం వచ్చేలా పనులు నిర్వహించాలని డీఆర్‌డీవో దత్తారావు సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఫ్లడ్ డైవర్షన్ డ్రెయిన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన పంచాయతీలోని ప్రతి కార్మికుడు ఉపాధి హామీ పనులకు హాజరై పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరారు. సగటు వేతనం కనీసం రూ.300 వచ్చే విధంగా పనుల ప్రణాళిక ఉండాలని తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 150 మంది కార్మికులు పనులకు వచ్చేలా లేబర్ ఇంప్రూవ్‌మెంట్ చర్యలు చేపట్టాలని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులను ఆదేశించారు. పనుల నాణ్యతతో పాటు కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ సంగీత లచ్చన్న, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.