calender_icon.png 23 January, 2026 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాన్ని హరితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

23-01-2026 06:06:39 PM

అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి 

తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామాన్ని పచ్చని హరితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామని సర్పంచి కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను సర్పంచ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు  చెప్పారు.

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, ఉపసర్పంచ్  వెలిశాల సరిత వార్డు సభ్యులు కడారి సుకన్య, మరికంటి జానకమ్మ,ఫీల్డ్ అసిస్టెంట్ మోతే చంద్రకళ, గ్రామపంచాయతీ సిబ్బంది ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.