మోదీతోనే ఓబీసీరిజర్వేషన్లు సాధ్యం
- కాంగ్రెస్ ఓబీసీల సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించింది
- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రధాని మోదీ హయాంలోనే చట్టసభలలో ఓబీసీల రిజర్వేషన్లు సాధించితీరుతామని బీజేపీ రాజ్యసభ సభ్యలు ఆర్.కృష్ణయ్య అన్నా రు. అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ నాయకత్వంలో డిల్లీలోని జంతర్ మంతర్ లో జరిగిన ‘ఓబీసీ‘ ల మహాధర్నాలో ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర జనగణనలో ఓబీసీ జనగణన చేపట్టాల్సిన అవ సరం ఉందని, ఈ విషయంపై ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారన్నారు. ఓబీసీ వర్గాలు తమ హక్కులు సాధించుకొనేందుకు రాజకీయపార్టీలను పక్కనపెట్టి సంఘటితంగా పోరాడాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. 5 దశాబ్ధాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించిందన్నారు.
ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఏర్పాటుపై కేంద్ర ప్రభత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని లేదా పార్లమెంటరీ సంయుక్త కమిటిని ఏర్పాటు చేయాల్సిన అవశక్యత ఉం దని, 5 వేలకోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యు లు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వల్లే దేశవ్యాప్తంగా ఓబీసీల సమగ్రాభివృద్దికి, అస మానతలు అధిగమించేందుకు ‘ఓబీసీ సబ్-ప్లాన్’ చట్టిన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెం ట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సుబ్బారావు, వివిధ రాష్ట్రాల నాయకులు డి.రమాదేవి, సోనూ, మనుబర్తి లలిత, ఆదిలక్షి ఇలంగన్యాదవ్, డి.తేజస్విని, ఝాన్సీ, బత్తుల వెంకటేష్, విజయ బాబా, రమణ్ సింగ్, దోడ్ సుజాన్సింగ్, బైసింగ్ పేరయ్య, హైమ, ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




