calender_icon.png 6 June, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై అధికారుల దర్యాప్తు

05-06-2025 10:24:13 AM

హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై(Erragadda Mental Hospital) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మానసిక రోగులు అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు విచారిస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 3 రోజుల క్రితం 72 మంది రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి చెందగా, 71 మంది చికిత్స పొందుతున్నారు.

ఉస్మానియా ఆసుపత్రిలో(Osmania General Hospital) 25 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మిగతావారి పరిస్థితి నిలకడగానే ఉందని ఎర్రగడ్డ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. రోగుల అనారోగ్యానికి ఆహారం కలుషితం అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రికి ఆహారం సరఫరా చేసే జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అధికారులు ఆహార నమూనాలను ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై డీఎంఈ, డీఎంహెచ్ వో విచారణ చేస్తున్నారు. రోగులు అనారోగ్యానికి గురైన కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.