22 August, 2026 | 8:19 PM

Breaking News

ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన   •   సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం   •   ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం   •   శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్   •   పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి   •   ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా   •   ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య   •  

రైతులకు అధికారులు సహకరించాలి

21-04-2026 01:50 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

బోథ్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పంటలను విక్రయించేందుకు మార్కెట్ కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపడుతూ వారికి న్యాయం జరి గేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

ముందుగా తూకం కాంటాలకు ప్రత్యేక పూజలు చేసి, మార్కెట్ కు పంటను తీసుకొచ్చిన తొలి రైతును సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. తేమ శాతం సాకుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, మద్దత్తు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఉమేష్‌తో పాటు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.