calender_icon.png 8 June, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి రెవెన్యూ సదస్సులో అధికారుల నిలదీత

06-06-2025 12:00:00 AM

జుక్కల్, జూన్ 5 (విజయక్రాంతి) : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పోడు భూముల రైతులు గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో పట్టా పాస్ బుక్కుల గురించి అధికారులను నిలదీశారు. పోడు భూములకు కూడా పట్టాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాని ఊసు ఎత్తడం లేదు ఎందుకని వారు అధికారులను ప్రశ్నించారు.

పట్ట పాసుబుక్కులు ఇవ్వకపోవడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో భూప్రక్షాళన కార్యక్రమంలో తమ వద్ద సమాచారం తీసుకుని పాస్బుక్కులు పార్టీ బి లో ఉంచినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ పాస్ బుక్కులు చెల్లని రూపాయిగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు తీర్చకుంటే సదస్సులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

పట్టా పాస్బుక్కులు లేని రైతుల కోసం ఇంకా ఏ సదస్సులు పెట్టి పట్టాలు ఇస్తారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాస్ బుక్ ల మీద గతంలో తాము బ్యాంకులో లోన్లు కూడా తీసుకున్నా మని కానీ నకలు కూడా ఉండేవని చెప్పారు. ధరణి వచ్చిన తర్వాత అవి కనిపించకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇచ్చిన అసైన్మెంట్ భూములకు ఫారెస్ట్ భూములు అంటూ తమకు మనోవేదనకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏ ప్రభుత్వం వచ్చిన ఉన్నవారికి అన్ని పథకాలు వర్తిస్తున్నాయని వారికి ఏ పథకాలు గాని ఈ సమస్య గాని పట్టించుకోవడంలేదని వేదన వెళ్లగక్కారు. బస్వాపూర్ గ్రామంలోని 200 మంది కట్ట పాస్బుక్కులు లేని వారు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అసైన్మెంట్ భూముల్లో తాము సాగు చేస్తున్నామని పంటలు వేసి పంటలు పండిస్తున్నామని పేర్కొన్నారు.

ఇంకా ఎన్ని రోజులు పట్టా పాస్ బుక్ ల కోసం ఎదురు చూడాలో మీరే చెప్పండి అని అడిగారు. సుమారు గంటసేపు అధికారులు రైతులు కలిసి ఇదే అంశంపై చర్చించారు. తమకు పట్ట పాసుబుక్కులు ఇవ్వకుంటే మునముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రాం పటేల్, స్వాతి, కార్యదర్శి భరద్వాల్ తదితరులు పాల్గొన్నారు.