calender_icon.png 8 June, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి..

06-06-2025 12:00:00 AM

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు గురువారం ములుగు మండలం ఇంచర్ల గ్రామం రైతు వైదికలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లాకలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.

రైతులతో ముఖాముఖి మాట్లాడి,వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ,రైతుల సందేహాలను నివృత్తి చేశారు.  భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి,నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. నిర్ణీత షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని అన్నారు.