30-05-2025 07:29:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో లారీల కొరత నేపథ్యంలో వరి ధాన్యం రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లను ఉపయోగించుకోవడంపై విజయ క్రాంతి డిజిటల్ పత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం లారీల కొరత వార్త ప్రచురితం కావడంతో అధికారులు లారీలను తెప్పించి శుక్రవారం ఆయా కొనుగోలు కేంద్రంలో నిలువ ఉన్నదాన్ని కూలీల సాయంతో రైస్ మిల్లర్లకు తరలించడంతో రైతులకు ఇబ్బందులు దూరమయ్యాయి.