calender_icon.png 1 June, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వేతనాలు చెల్లించి సమస్యలను పరిష్కరించాలి

30-05-2025 07:34:52 PM

కలెక్టర్ కార్యాలయంవద్ద  ధర్నాలో వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ఉపాధిలో ఉన్న పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య(Telangana Agricultural Workers Union State Secretary Nari Ilayya) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం  నల్లగొండ కలెక్టర్ కార్యాలయం(Nalgonda Collector Office) ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ వామపక్షాల పోరాటాల ఫలితంగా 2005 సంవత్సరం లో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు రెండున్నర లక్షల  కోట్లు అవసరం ఉండగా కేవలం 73 వేల కోట్లు నామమాత్రం కేటాయింపులు చేసి  చేతులు దులుపుకుందని విమర్శించారు.

 కానీ మోడీ కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడటానికి ఉపాధి హామీ చట్టం(Employment Guarantee Act) లేకుండా కుట్ర చేస్తున్నాడని దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత వ్యవసాయ కార్మికులపై ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలోకి యంత్రాలు రావడంతో కూలీలకు పని దొరకని దుస్థితి ఏర్పడిందని చట్టం పేదలకు ఉపయోగపడుతుందని గ్రామాల్లో ఉన్న పేదలు ఆర్థికంగా బలపడితే ఈ దేశం ముందుకు పోతుందని ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం 100 రోజుల పనిని తెస్తే ఈనాటి మోడీ ప్రభుత్వం ఎత్తివేయడానికి కుట్ర పూనుకుందని అందులో కొత్త జీవోలు తెస్తూ కార్మికులకు నష్టం చేసే పద్ధతుల్లో , వ్యవహరిస్తుందని తెలియజేశారు. సంవత్సరానికి 200రోజుల పని దినాలు కల్పించి, రోజు కూలి రూ.600 ఇవ్వాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు చెల్లించి జాబు కార్డు లేని పేదలందరికీ నూతన జాబు కార్డులు ఇవ్వాలని, అలాగే భార్యాభర్తలకు గడ్డపార తట్ట సారా కొడవలి గోడ్డలి ఇలాంటి పని, ముట్లు ఇవ్వాలని కోరారు.

పని ప్రదేశాల్లో తాగడానికి నీరు నీడ టెంటు మెడికల్ మెడికల్ కిట్టు లాంటి సౌకర్యాలు కల్పించాలని నాలుగు కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో చార్జీలు చెల్లించాలని చట్టంలో ఉందని తెలిపారు .చట్టం వచ్చిన నాటి నుండి పనిచేస్తున్న ఉపాధి సిబ్బందిని పర్మినెంట్ చేసి వారి వేతనాలు పెంచాలని నెల నెల జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యంతో పాటు పనిచేయని రోజుల్లో నష్టపరిహారం చెల్లిస్తూ మరణిస్తే 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ,  కత్తుల లింగస్వామి, జిల్లా నాయకులు చింతపల్లి మారయ్య, గండమల్ల రాములు,  పెంటమల్ల సుకన్య, మన్నె బిక్షం, కట్ట అంజయ్య, రుద్రాక్షి యాదయ్య, వంగూరి వెంకన్న, పెరిక మల్లయ్య, లింగయ్య, బూరుగు లక్ష్మి, ఓకుంట్ల నరసమ్మ, బూస్ అశోకు, ఐతరాజు లక్ష్మయ్య, రాజు,  జ్యోతి,  తదితరులు పాల్గొన్నారు.