calender_icon.png 15 June, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మో జూన్

14-06-2025 12:00:00 AM

  1. బెంబేలెత్తుతున్నమిడిల్ క్లాస్ జనాలు 
  2. ఆదాయం బారెడు ఖర్చు మూరెడు
  3. ఒకవైపు విద్యాసంస్థల రీఓపెన్.... మరోవైపు రైతుల సాగుబడి 

రంగారెడ్డి,జూన్ 13 (విజయ క్రాంతి): జూన్ నెల వస్తేనే పేద మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెల ప్రారంభంలోనే ఆ దాయం ఖర్చు లెక్కలు సరిచేసుకుంటున్నా రు. రోజువారి ఖర్చులతో పాటు విద్యాసంవత్సరం ప్రారంభం చదువులు పల్లెల్లో రైత న్నలకు సాగు ఖర్చులు తోడవనున్నాయి. సామాన్యులకు నడ్డి విరిచే అధిక ఖర్చులు నెల చూసి అంతా తలలు పట్టుకునే పరిస్థితి.

కొంత ఆర్థికంగా మెరుగు ఉన్న వారి పరిస్థితి అటు ఉంచితే....పేద, మధ్యతరగతి ప్రజల త ప్పనిసరిగా అప్పుల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా విద్యార్థుల తల్లిదండ్రులు స్టే షనరీల వద్ద ఆ పుస్తకాలు కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఎరువులు విత్తనాలు కొ నుగోలు కోసం ఫర్టిలైజర్ దుకాణాలకు వద్ద కు రైతులు పరుగులు తీస్తున్నా దృశ్యాలే మ నకు కనబడుతున్నాయి.

తమ బిడ్డలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రభుత్వ ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలల గడప తొక్కుతున్నా రు. పాఠశాలలో పున :ప్రారంభం కావడం తో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యజమాన్యాల దందా కూడా తారాస్థాయికి చేరింది. ఇప్పటికే అడ్మిషన్ల పేరిటా సామాన్యులను దోచుకోగా...

స్కూల్లో చేరిన పిల్లలనుంచి  ప్రై వేటు,కార్పోరేట్ ప్లే స్కూల్ యజమాన్యాలు పూర్తి ఫీజు కట్టాలని యూనిఫామ్,పుస్తకాలు, ట్రావలింగ్ చార్జి అంటూ లెక్కలు కడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు జాబితా ముంద ల పెడుతున్నారు. సరాసరి నర్సరీ పీజే మిని మం 30 వేల నుంచి లక్ష పైనే పాఠశాలలో వసూలు చేస్తున్నారు. నర్సరీ మొదలుకొని డిగ్రీ ఆపై స్థాయి చదువులు చదివే పిల్లలు ఉం టే వారి కుటుంబాలకు విద్యాపరంగానే ఆర్థిక భారం కానుంది.

రైతుల సాగుబడి

తొలకరి జల్లులు కురిసిన వెంటనే రైతులు సైతం పొలాల బాట పడుతున్నారు. పంట పెట్టుబడులు రైతులకు భారం కానున్నాయి. మృగశిర కార్తె ప్రారంభం అయ్యిం దంటే చాలు రైతులు పూర్తిగా ఈనెల అంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు దొరికిన చోటల్లా అప్పులు తీసుకొచ్చి సీజన్ దాటకుండానే వ్యవసాయ పొలాల్లో పనులు ప్రారంభిస్తారు. విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు ఇలా అన్ని రైతులకు తడిసి మోపడతాయి.

దీంతో రైతులు ఒకవైపు వ్యవ సాయ ఖర్చులతో పాటు మరోవైపు తమ బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుబడి చదువులకు మోయలేని భారంగా రైతన్నలు ఇబ్బం దులు పడుతున్న పరిస్థితి దాపురించింది. జూన్ నెలలో సామాన్య మద్దతు కుటుంబాలను ఎవర్ని కదిలించిన అమ్మో జూన్ బాబోయ్ అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

రోజు రోజుకు పెరిగిపోతున్న ఖర్చులను చూసి  మధ్యతరగతి కుటుంబాలు  కూనరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో  పెరుగుతున్న విద్యా ఖర్చులను, ఎరువుల, విత్తనా ల్లో  ఖర్చును ప్రభుత్వం కట్టడి చేయాల్సిన  అవసరం ఎంతైనా ఉందని సామాన్య ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫీజులు భరించలేకపోతున్నాం

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను భరించలేకపోతున్నాం. అదేవిధంగా పుస్తకాలు, నోట్ బుక్ ల పేరుతో పాఠశాలల యాజమాన్యాలు సామాన్యుల ను దోచుకుంటున్నాయి. ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందిం చి చర్యలు తీసుకురావాలి. నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం చా లా ఉంది. ప్రైవేటు బడులు ప్రతి ఏడాది ఫీజులను పెంచుతూనే ఉన్నాయి. దీనిపై ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలి.

                                                                                                                                                                                                               వెంకన్న, రాజేంద్రనగర్

జూన్ నెల రాంగనే భయమైతుంది

జూన్ నెల రాంగనే భయమైతుంది.  ఓ దిక్కు పిల్లల ఫీజులు, మరో దిక్కు ఎరువులు, మందుల రేట్లు మస్తు పెరిగిపోయినయ్. ఈ సారి రైతుబంధు కూడా పడలేదు. దీంతో  వానాకాలం పంటలు సాగుకు, పిల్లల ఫీజులకు అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి ప్రైవేటు స్కూళ్లు , కాలేజీలో ఫీజులు తగ్గించాలి. అట్లనే రైతు బంధు పైసలు ఇవ్వాలి.

ఊరడి రాములు, ముడిమ్యాల, చేవెళ్ల మండలం