13-06-2025 11:14:20 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని మండల పరిషత్ పాఠశాల బస్టాండ్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాల పంపిణీ జరిగింది. శుక్రవారం ఆ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నామీహ మహేవిష్, ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ,మైనార్టీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, జమ మసీద్ అధ్యక్షులు జహీర్ అహ్మద్, గంగా నరసయ్య, మధిర సత్యనారాయణ ,సయ్యద్ జియావుద్దీన్ ,చేతులమీదుగా పాఠశాల విద్యార్థులకు యూనిఫాం,పుస్తకాలు అందజేశారు.