calender_icon.png 28 June, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్.. ఆదాయంలో ఫేమ్!

28-06-2025 12:45:09 AM

- మూడేండ్ల తర్వాత దిగుబడి, ముప్పు ఏండ్ల పాటు ఆదాయం

- చేవెళ్ల డివిజన్లో గత మూడేండ్లలో 291 ఎకరాల్లో సాగు

-మెగా ప్లాంటేషన్లో భాగంగా నేడు మరో 91 ఎకరాల్లో... 

- మొక్కలు నాటి ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

చేవెళ్ల, జూన్ 27:ఒకసారి మొక్కలు నాటితే ముప్పు ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. మొక్కల దగ్గరి నుంచి మార్కె టింగ్ దాకా ప్రభుత్వం సహకారం అందిస్తుండడంతో చేవెళ్ల డివిజన్ లో ఏటికేడు సాగు పెరుగుతోంది.

త మూడేళ్లలో 100 మంది రైతులు 291 ఎకరాల్లో (చేవెళ్లలో 70, మొయినాబాద్లో 5, షాబాద్లో 134, శంకర్పల్లిలో 82) ఆయిల్ పామ్ పంట సాగు చేయగా.. శనివారం ఒక్క రోజే ‘అయి ల్ పామ్ మెగా ప్లాంటేషన్’లో భాగంగా మరో 15 మంది రైతులు 91 ఎకరాల్లో మొ క్కలు నాటనున్నారు.

వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వర రావు చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దేవుని ఎర్రవల్లికి చెందిన రైతు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి పొలంలో మొక్కలు నా టి ఈ ప్లాంటేషన్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

సర్కారు ప్రోత్సాహం

దేశంలో వంటనూనెల్లో ఎక్కువగా పా మాయిల్ వాడుతున్న విషయం తెలిసిందే. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయం గా ఉత్పత్తి పెంచితే రైతులకు ఆదా యం పెరగడంతో పాటు దేశం ఆర్థికంగా ముందుకె ళ్తుందన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భా గంగా నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.193 ఉండగా, రైతుల నుంచి కేవలం రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నారు.

మిగతా రూ.173 (దాదాపు 90 శాతం)ను ప్రభుత్వం చెల్లిస్తోంది. అంతేకాదు మొక్కలు నాటిన తర్వాత నిర్వహణ ఖర్చులకింద ఎకరాకు రూ.4,200 చొప్పున నాలు గేళ్ల పాటు ప్రోత్సాహకంగా అందిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ కింద సబ్సిడీపై 12.20 ఎకరాల వరకు డ్రిప్ సదుపాయం కల్పిస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఓసీ రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం, ఐదెకరాలు దాటితే 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. అంతేకాదు, పంటను కొనుగోలు చేయడానికి జిల్లాకో అయిల్ కంపెనీలకు ప్రభుత్వమే కాంట్రాక్టు ఇస్తోంది.

ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి

ఆయిల్ పామ్ మొక్కలు ఎకరాకు 55 వరకు నాటుతారు. మూడేండ్లు పూర్తయిన తర్వాత నాలుగో యేడాది నుంచి దిగుబడి (4 నుంచి 6 టన్నులు) మొదలవుతుంది. ఐదో సంవత్సరంలో (8 నుంచి 10 టన్ను లు), ఆరో సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో (10 నుంచి 15 టన్నులు) దిగుబడి లభిస్తుంది. ఇది 30 నుంచి 35 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం టన్నుకు రూ.21, 000 పలుకుతోంది. ఈ లెక్కన సరాసరిగా ఎకరాకు రూ.3 లక్షలు వచ్చినా, రూ.లక్ష ఖర్చులు పోనూ రూ.2 లక్షల వరకు ఆదా యం వస్తుంది. అంతేకాదు ఈ మొక్కల మధ్య కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. నాటు, టర్కీ, గిరిరాజ్ లాంటి కోళ్లు, పశువులు కూడా పెంచుకోవచ్చు.

రైతులు ముందుకు రావాలి

ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. సబ్సిడీ కింద మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ అందించడమే కాకుండా, నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తోంది. చేవెళ్ల డివిజన్లో గత మూడేళ్లలో 291 ఎకరాల్లో ఈ పంట సాగు చేశారు. ఇవాళ ఒక్క రోజే 91 ఎకరాల్లో మెగా ప్లాంటేషన్ చేయనున్నాం. రైతులు ముందుకొస్తే... ఫీల్ విజిట్ చేసి సహకారం అందిస్తాం.

- కీర్తి కృష్ణ, హార్టికల్చర్ ఆఫీసర్, చేవెళ్ల డివిజన్