17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బంగారం కోసం వృద్ధురాలి హత్య

29-12-2025 12:20 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 28:(విజయక్రాంతి): ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన లింగంపేట మండలం పోల్కంపేటలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన లింగంపేట మండలం పోల్కంపేటలో  శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. లింగంపేట పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. పోల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన (75)కు ఇద్దరు కుమారులున్నారు.

వంతులో భాగంగా వారంరోజుల క్రితం ఆమె పెద్ద కుమారుడు రాజుల వద్దకు వెళ్లింది. అయితే రాజుల కుటుంబం మూడు రోజుల క్రితం తీర్థయాత్రకు వెళ్లింది. ఇంట్లో ఆమె ఒకతే ఉందని పసిగట్టిన దుండగుడు శుక్రవారం రాత్రి ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేసి ఆమెపై ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను  దోచుకెళ్లాడు. అందులో ఒక పుస్తెలతాడు, కమ్మలు, వంక ఉంగరం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.