03-06-2025 11:13:21 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): కారు బైక్ ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన రాయపోల్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్కు చెందిన జీర్కపల్లి నరేందర్(22) కుకునూరుపల్లిలో ఫ్లెక్సీ షాపు నడిపిస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి ఫ్లెక్సీ షాప్ బంద్ చేసి బైక్పై దౌల్తాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో దౌల్తాబాద్ వైపు నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న ఓ కారు రాయపోల్ వద్ద బైక్ను ఢీకొన్నది. దీంతో బైక్పై వెళ్తున్న నరేందర్ తీవ్రంగా గాయపడడంతో ఆయనను పోలీసు వారి వాహనంలో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేసరికి నరేందర్ మృతి చెందాడు.