04-06-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం లక్ష్మణచందా మండలం కనకాపూర్, నిర్మల్ గ్రామీణ మండలం అక్కపూర్లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఇందుకోసమే భూభా రతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే తొలి విడత సదస్సులు విజయవంతం గా ముగిశాయని, నేటి (మంగళవారం) నుం చి 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వెల్లడించారు. సదస్సుల్లో పాల్గొన్న ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయం గా అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి, వెం టనే రశీదులు ఇవ్వాలని ఆదేశించారు.
సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించి న రెవెన్యూ సదస్సులో హెల్ప్డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి, రైతుల భూస మస్యల దరఖాస్తులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలో తరగతిగదులు, ఇంకుడు గుంత, లైటింగ్ వంటి వసతులను కలెక్టర్ పరిశీలించారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్లు సరిత, సంతోష్, ఎంపీడీవో గజానన్, గిర్ధావర్ సం తోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు.