18-06-2025 12:00:00 AM
తాడ్వాయి, జూన్, 17( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామం లో ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్త్స్ర మురళి తెలిపారు చందాపూర్ గ్రామంలో గడ్డం నారాయణ (69) అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో శివారులోని పొలం వద్దకు వెళ్లారు చేను వద్ద గేదెలు మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ఆయన కాలికి తగిలాయి.
దీంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు వెంటనే అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్త్స్ర మురళి తెలిపారు మృతుడి కుమారుడు రణదీప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు మృతుడికి భార్యా పిల్లలు ఉన్నారు