26 February, 2026 | 10:56 AM

ఉపాధ్యాయుడు లేక తెరుచుకొని పాఠశాల

26-02-2026 12:00 AM

బెజ్జూర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ ‘గిరిజన ప్రాథమిక పాఠశాల’ గత 25 రోజులుగా మూతపడినట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పరదేశి జనవరి 31న పదవీ విరమణ పొందడంతో, అప్పటి నుంచి పాఠశాలకు కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడం వల్ల విద్యా బోధన జరగడం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత మండల విద్యాధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఉన్నతాధికారులుచర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.