17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

27-02-2026 12:00 AM

నిర్మల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సొన్ మండలంలోని పలు గ్రామాల్లో అకా ల వర్షాలు, వడగళ్ల వర్షంవల్ల నష్టపోయిన మొక్క జొన్న పంటనుఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మండలంలోని సొన్, కూచన్ పల్లి, బొప్పారం, న్యూ వెల్మల్ గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు.

సుమారు ఒక్క సొన్ మండలంలోనే 1000 ఎకరాలపైనే పంట నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీసారి నివేదికలు తెప్పించుకోవడం తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్ట పరిహారం చెల్లించలేదన్నారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ నరేష్, రైతులు పాల్గొన్నారు. అలాగే సారంగాపూర్ మామడ మండలంలోని వివిధ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కరిపె రవళి  విలాస్, మండల ఉపాధ్యక్షులు వెలిశాలి తిరుమలచారి, మండల బీజేపీ నాయకులు చెన్న రాజేశ్వర్, సాహెబ్ రావ్,  ఆడెపు మహేందర్, అల్లాడి నర్సయ్య, మహేందర్,ముత్యంతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.