16-06-2025 04:57:06 PM
వామపక్ష నేతల డిమాండ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్(Operation Kagar)ను వెంటనే నిలిపివేయాలని, పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని మహబూబాబాద్ జిల్లా వామపక్ష పార్టీల నాయకులు బి.విజయ సారధి, సాదుల శ్రీనివాస్, మండల వెంకన్న, కొత్తపల్లి రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రచార పోస్టర్ ను సోమవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ నాయకులు పెరుగు కుమార్, ఆకుల రాజు, రేషపల్లి నవీన్, గుణగంటి రాజన్న, హాలావత్ లింగ్యా నాయక్, గుజ్జు దేవేందర్, నందగిరి వెంకటేశ్వర్లు, మదర్, సూర్యం, చింతకుంట్ల వెంకన్న, భాస్కర్ రెడ్డి, రాజమౌళి, పాపయ్య, గౌని వెంకన్న, మాధవి తదితరులు పాల్గొన్నారు.