16-06-2025 04:49:17 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఆర్టీసీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ గోడ ప్రతులను ఇల్లందు ఆర్టీసీ డిపో వద్ద సోమవారం ఆవిష్కరించారు. ఉదయం డ్యూటీలోకి వెళ్ళే ఆర్టిసీ డిపో కార్మికుల అడ్డాపై సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీలలో ఖమ్మం నగరంలో ఆర్టీసీ ఎస్ డబ్ల్యు ఎఫ్ రాష్ట్ర మహాసభల నేపధ్యంలో మహాసభ జయప్రదం చేయాలని కోరుతూ గోడ ప్రతులను ఆవిష్కరించారు.
అనంతరం డిపో అధ్యక్షులు ఐ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, జిల్లా నాయకులు తాళ్లూరి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసి కార్మికులు సంక్షేమం కోసం, సంస్థ మనుగడ కోసం సీటు పనిచేస్తున్నారని మహాసభ జయప్రదం కోసం సంఘం బాధ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు జులై 9 తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, నూర్ భాష, వెంకటయ్య, అశోక్, కృష్ణ, మహేశ్వరి, నాగలక్ష్మి, ఏ ఎస్ రావు, సురేష్, సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు.